ఇల్లంతకుంట, మార్చి 26 : పాఠశాల ఆవరణలోని మైదానం ఆడుతూ ఓ విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. సిరిసిల్ల సమీపంలోని కందికట్కూర్కు చెందిన ఏలేటి శ్రీనివాస్, జ్యోతి దంపతులకు కుమారుడు సాయితేజ (12)కు గుండెలో రంధం ఉన్నది. చిన్నప్పుడే గుర్తించినా పేదరికం కారణంగా ఆపరేషన్ చేయించలేదు. మందులు వాడు తున్నారు. స్థానిక ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నా డు. మధ్యాహ్నం స్నేహితులతో కలిసి పాఠ శాల మైదానంలో ఆడుతుండగా సాయితేజ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. పక్కనే మెట్లపై కూర్చోని పడిపోయాడు. వెంటనే కరీంనగర్లోని ప్రభుత్వ దవాఖానకు తరలిం చగా, అప్పటికే మృతి చెందాడు.