కరీంనగర్ : చదువుపై ఇష్టం లేక ఓ విద్యార్థిని బిల్డింగ్పై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్ పూర్ గ్రామానికి చెందిన హాసిని (15) అనే విద్యార్థిని గంగాధర మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది.
ఆదివారం సాయంత్రం హాసిని పాఠశాల భవనంపై అంతస్తుకు చేరుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. గమనించిన చుట్టుపక్కల వాళ్లు అక్కడికి చేరుకొని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. అయినా వినకుండా.. విద్యార్థిని బిల్డింగ్పై నుంచి దూకడంతో చాపలతో విద్యార్థినిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఎత్తు నుంచి పడడంతో కాలు విరిగింది. ఎస్ఐ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థినిని కరీంనగర్ ఆసుప్రతికి తరలించారు. హాస్టల్లో ఉండి చదువుకోవడం ఇష్టం లేకనే విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించినట్లు ఎస్ఐ వివరించారు.