హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఘటన నేపథ్యంలో అసెంబ్లీకి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. గురువారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ఎవరినీ అనుమతించలేదు. సాధారణ సందర్శకుల పాస్లను నిలిపివేశారు. అసెంబ్లీ ప్రాంగణం, లాబీ, గ్యాలరీ, మీడియా పాయింట్ వద్ద కూడా పోలీసులు క్షుణ్నంగా తనిఖీ చేశారు. నిర్దేశిత పాస్లు ఉన్న వారిని కూడా గతంలోలాగా ఇబ్బడిముబ్బడిగా అనుమతించలేదు. మంత్రులు మినహా ఎమ్మెల్యేల వ్యక్తిగత సిబ్బందికి సైతం అసెంబ్లీ లాబీలోకి అనుమతి నిరాకరించారు.