నాగర్కర్నూలు : రాష్ట్రంలో వీధికుక్కలు(Stray dogs) స్వైర విహారం చేస్తున్నాయి. మనుషులు, పశువులపై దాడి చేస్తూ బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా నాగర్కర్నూలు(Nagarkurnool) జిల్లాలో వీధి కుక్కలు ఒక్క రోజే ఏడుగుఉ చిన్నారులపై(Attacked children) దాడి చేశాయి. గాయపడిన చిన్నారులను హాస్పిటల్స్లో చేర్చించారు.
కాగా, అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుక్కలు ఎప్పుడు ఎవరిపైనా దాడి చేస్తాయోనని భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకుకోవాలని కోరుతున్నారు.