గద్వాల అర్బన్/హనుమకొండ చౌరస్తా, జూలై 15: వేర్వేరు జిల్లాల్లో శనివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వాటి దాడిలో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన పదేండ్ల బాలుడు వినయ్ బయట ఆడుకుంటుండగా.. ఓ వీధి కుక్క బాలుడిపై దాడి చేసింది. స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలుడిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
వినయ్ చికిత్స పొందుతూ కోలుకుంటున్నా డు. మరో చోట.. హనుమకొండలోని కుమార్పల్లి లయోల స్కూల్ పక్కన మదర్సా నుంచి వెళ్తున్న బా లుడిపై ఓ వీధి కుక్క దాడి చేసింది. బాలుడి ముఖంపై విచక్షణారహితంగా కాట్లు వేసింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిపై ఒక్కసారిగా కుక్క విరుచుకుపడి తీవ్రంగా గాయపర్చింది. స్థానికులు కుక్కను తరిమికొట్టి బాలుడిని దవాఖానకు తరలించారు.