H3N2 | దేశంలో సీజనల్ ఎన్ప్లుయెంజా హెచ్3ఎన్2 కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వైరస్ను ఎదుర్కొనేందుకు అన్ని దవాఖానాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆదేశించింది. మరో వైపు గుజరాత్ వడోదర ప్రభుత్వ ఆసుప్రతిలో ఫ్లూ లాంటి లక్షణాలతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషయాన్ని అధికారులు మంగళవారం ధ్రువీకరించారు. అయితే, మృతికి కారణం హెచ్3ఎన్2 వైరస్ కారణమా? అని ప్రశ్నించగా.. నమూనాలను పరీక్షల కోసం పంపినట్లు తెలిపారు.
సదరు మహిళ (68) సోమవారం మరణించినట్ల ఎస్ఎస్జీ హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ హేలయ తెలిపారు. నమూనాలను సేకరించి పరీక్షల కోసం పంపామని, మహిళ మృతికి గల కారణాలను కమిటీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. మృతులు వడోదరలోని ఫతేగంజ్ నివాసి. అయితే, ఈ ఏడాది సీజనల్ ఇన్ఫ్లుయెంజా కేసులు ఈ ఏడాది గుజరాత్లో ఇప్పటి వరకు మూడు కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది మార్చి 10 వరకు గుజరాత్లో 80 సీజనల్ ఫ్లూ కేసులు నమోదయ్యాయని, ఇందులో హెచ్1ఎన్1 కేసులు 77 ఉన్నాయని, మరో మూడు హెచ్3ఎన్2 కేసులని అధికారులు పేర్కొన్నారు. అయితే హెచ్3ఎన్2 వైరస్ కారణంగా ఇప్పటి వరకు ఇక్కడ మరణం నమోదు కాలేదని వివరించారు.