హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు శుక్రవారం అమెరికా పర్యటనకు వెళ్లారు. విద్యుత్తు వ్యవస్థలపై అధ్యయనం చేసేందుకు ఆ దేశంలో 15 రోజుల పాటు పర్యటించనున్నారు. అంతర్జాతీయంగా విద్యుత్తు సంస్థల్లో వస్తున్న మార్పులు, ఆధునిక సాంకేతిక పద్ధతులు, ఆయా సంస్థలు అవలంబిస్తున్న విధానాలపై జ రిగే సెమినార్లలో పాల్గొననున్నారు.
రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈ సీ) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో సీఎండీని ఈ పర్యటనకు ఎంపిక చేశారు. శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్లో జరిగే సెమినార్లలో సీఎం డీ ప్రభాకర్రావు ఇతర ప్రతినిధులతోపాటు పాల్గొంటారు. ఆగస్టు 13న అమెరికా పర్యటనను ముగించుకొని సీఎండీ హైదరాబాద్కు రానున్నారు. సీఎండీ ప్రభాకర్రావు స్థానంలో ఇన్చార్జి సీఎండీగా జేఎండీ శ్రీనివాస్రావుకు అప్పగించారు. ఆయన వచ్చే వరకు శ్రీనివాసరావు ఆ బాధ్యతల్లో కొనసాగుతారు.