హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అవార్డులు సాధించడంలో మన రాష్ట్ర పట్టణాలు ముందుంటున్నాయని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ అధ్యక్షుడు రాజు వెన్రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని తెలంగాణ మున్సిపల్ చైర్మన్స్ చాంబర్ కార్యాలయంలో స్వచ్ఛ సర్వేక్షణ్, పట్టణ ప్రగతి అవార్డులు సాధించిన మున్సిపాలిటీల చైర్మన్లను రాజు వెన్రెడ్డి సన్మానించారు.
రాజు వెన్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. అవార్డులు సాధించిన సూర్యాపేట, షాద్నగర్, కల్వకుర్తి, బాన్సువాడ, శంషాబాద్, సంగారెడ్డి, ఇల్లందు, తూఫ్రాన్, అలంపూర్, ఇబ్రహీంపట్నం, భూత్పూర్ మున్సిపాలిటీల చైర్మన్లను సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్ ఉపాధ్యక్షురాలు మంజుల రమేశ్, ప్రధానకార్యదర్శి ఎడ్మ సత్యం పలువురు మున్సిపల్ చైర్మన్లు పాల్గొన్నారు.