హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దొంగిలించిన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని సీఐడీ డీజీ చారుసిన్హా తెలిపారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 1,24,850 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇప్పటివరకు 4,82, 652 మొబైల్ పరికరాలను బ్లాక్ చేయగా, 2,82,260 ఫోన్లకు సంబంధించిన ట్రేసిబిలిటీ రిపోర్టులు అందాయని, వీటిలో 1,24,850 ఫోన్లను రికవరీ చేశామని పేర్కొన్నారు.
సినీ ఫక్కీలో కిలో బంగారం చోరీ! ; కారంపూడిలో ఘటన
హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): సినీ ఫక్కీలో దుండగులు వ్యక్తిపై దాడి చేసి కిలో బంగా రం చోరీ చేయడం కలకలం రేపింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్లోని పల్నా డు జిల్లా కారంపూడి పట్టణంలో చోటుచేసుకుంది. వినుకొండకు చెందిన ఓ వ్యక్తి ఆర్డర్లపై బంగారు నగ లు తయారు చేసి దుకాణాలకు సైప్లె చేస్తుండేవాడు. సోమవారం అదే తరహాలో బంగారు ఆభరణాలను ఇచ్చేందుకు వెళ్లగా కొంత మంది బైక్పై హఠాత్తుగా వచ్చి దాడి చేశారు. అతడి వద్ద ఉన్న బంగారు నగల బ్యాగును లాక్కుని ఉడాయించారు. బాధితుడి ఫిర్యా దుతో కారంపూడి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.