హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వృత్తిదారులకు సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో కులవృత్తులు కొత్తపుంతలు తొక్కుతున్నాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్లో వినోద్కుమార్ను జాతీయ బీసీదళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శుక్రవారం ప్రత్యేకంగా కలిశారు. కులగణనతోపాటు బీసీలకు సంబంధించి పలు అంశాలను, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఆయనకు వివరించారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కులవృత్తుల్లో ఆధునికీకరణ చోటుచేసుకొన్నదని కొనియాడారు. రూ.లక్ష ప్రభుత్వ సాయంతో వృత్తిదారులు ఆర్థికంగా నిలదొక్కుకుంటారని, వృత్తి పనుల్లో ఆధునిక యంత్ర పరికరాలను సమకూర్చుకొంటున్నారని తెలిపారు. కులగణన చేపట్టాలని ఇప్పటికే కేంద్రానికి రాష్ట్రం నుంచి ప్రతిపాదన పంపామని తెలిపారు.