హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : బీజేపీ పాలిత రాష్ట్రం అస్సాం కూడా తెలంగాణనే అనుసరిస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. యూనివర్సిటీల్లో అధ్యాపక ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామన్ రిక్రూట్మెంట్ బోర్డును ఏర్పాటుచేసి, అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే, ఇదేవిధానాన్ని అమలు చేయాలని అస్సాం రాష్ట్ర క్యాబినెట్ గురువారం నిర్ణయించినట్టు వినోద్కుమార్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వ విధానాలను దేశంలోని అని రాష్ర్టాలు ఆమోదిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, రాష్ట్ర గవర్నర్కు ఈ విధానం ఎందుకు అర్థం కావడం లేదని ప్రశ్నించారు. కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు దస్ర్తాన్ని గవర్నర్ ఆమోదించకుండా ఆరు నెలలుగా తాత్సారం చేస్తున్నారని చెప్పారు. బిల్లును గవర్నర్ ఆమోదిస్తే వర్సిటీల్లో దాదాపు 2వేల అధ్యాపక పోస్టులు భర్తీ అవుతాయని తెలిపారు.