హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు మున్సిపల్ శాఖ పరిధిలో రూ.379.45 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. భారీ వరదలకు రోడ్లు, మురుగు కాలువలు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక మరమ్మతుల కోసం రూ.75.89 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.303.55 కోట్లు అవసరమని లెక్కలు వేశారు. వరదలకు గోదావరి పరీవాహక ప్రాంత జిల్లాల్లోనే ఎక్కువ నష్టం వాటిల్లింది.
నిర్మల్ జిల్లాలోని మున్సిపాలిటీలకు ఎక్కువ నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. ఈ జిల్లాలో రూ.132.50 కోట్ల నష్టం జరిగిందని, నిజామాబాద్ జిల్లాలో రూ.56.51 కోట్లు, మంచిర్యాలలో రూ.25.52 కోట్లు, జగిత్యాలలో రూ.24.11 కోట్లు, మేడ్చల్లో రూ.15.99 కోట్లు, నల్లగొండ జిల్లాలో రూ.20.97 కోట్లు, సంగారెడ్డిలో రూ.39.49 కోట్లు, మహబూబ్నగర్ జిల్లాలో రూ.39.06 కోట్లు నష్టం జరిగిందని గుర్తించారు. జీహెచ్ఎంసీ పనిధిలో బీటీ, సీసీ రోడ్ల మరమ్మతులకు రూ.10.50 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.