నల్లగొండ : నల్లగొండ జిల్లోలో రేపు (శుక్రవారం) మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు.
పట్టణంలో పర్యటన అనంతరం తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ను పరామర్శిస్తారు. అనంతరం మంత్రి కేటీఆర్ జిల్లాలోని మున్సిపాలిటీలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు.