హైదరాబాద్, జూన్28 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో ఈవెంట్ ఇండస్ట్రీకి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంసృతిక శాఖల మంత్రి డాక్టర్ శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హైటెక్స్లో జూలై 24, 25 తేదీల్లో నిర్వహించ తలపెట్టిన సౌతిండియన్ వెడ్డింగ్ ప్లానర్స్ కాంగ్రెస్ పోస్టర్ను బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిషరించారు. ఈ సదస్సు నిర్వహణకు ముందుకొచ్చిన తెలంగాణ చాంబర్ ఆఫ్ ఈవెంట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రతినిధులను మంత్రి అభినందించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరం అంతర్జాతీయంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నగర బ్రాండ్ ఇమేజ్ని పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. సాఫ్ట్వేర్, ఫార్మా ఎగుమతుల కేంద్రంగా ఇప్పటికే ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఈ మహానగరంలో ఈవెంట్ ఇండస్ట్రీ అభివృద్ధికి ఎంతో భవిష్యత్తు ఉందని, దీనికి రాష్ట్ర పర్యాటకశాఖ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ బలరాంబాబు, కనీషా సబనాన్ తదితరులు పాల్గొన్నారు.