హైదరాబాద్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వచ్చే నెల 26 నుంచి 28 వరకు 21వ వార్షిక సదస్సును నిర్వహించనున్న బయో ఏషియా.. బెల్జియంలోని ఫ్లాండర్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడ్ (ఎఫ్ఐటీ) రీజియన్ను తమ అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించింది. లైఫ్సైన్సెస్ రంగంలో భారత్-బెల్జియం మధ్య వాణిజ్యాభివృద్ధికి ఈ భాగస్వామ్యం ఎంతో దోహదపడుతుందని బయోఏషియా-2024 నిర్వాహకులు తెలిపారు.
ఎఫ్ఐటీని బయో ఏషియా అంతర్జాతీయ ప్రాంతీయ భాగస్వామిగా ప్రకటించడంపై రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లైఫ్సైన్సెస్ రంగం అభివృద్ధికి దోహదపడటంతోపాటు శాస్త్రీయ పరిశోధనలు, ఆవిష్కరణలకు ఫ్లాండర్స్ తోడ్పాటును అందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.