హైదరాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది చివరినాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 60 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే గుర్తించి ఈ నెల చివరినాటికి మిగతా 1,99,940 ఉ ద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, 42 వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిందని కోర్టు కేసుల కారణంగా నియామకాలు జరగలేదని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.