Cabinet Meeting | హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆదివారం మధ్యాహ్నం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3.30 గంటలకు సచివాలయంలో జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమాచార ఉత్తర్వులు జారీచేశారు.
జీఎస్టీ బిల్లును ఆమోదించడం, అడ్వొకేట్ జనరల్ నియామకానికి ఆమోదం (రాటిఫికేషన్), పంచాయతీరాజ్ చట్టంలో స్వల్ప సవరణలు, గత ప్రభుత్వం సిద్ధంచేసిన మూడు బిల్లులను రద్దు చేయడం, గ్రూప్ -1 ఉద్యోగాలను ఎలా భర్తీ చేద్దాం? మరో రెండు హామీలు ఎలా? ఎప్పటి నుంచి అమలు చేద్దాం? రానున్న బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలపై భేటీలో చర్చించే అవకాశం ఉన్నదని తెలిసింది. అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెక్రటరీలు హెడ్క్వార్టర్లోనే ఉండాలని సీఎస్ ఆదేశించారు.