ఎడ్యుకేషన్ డెస్క్ : దేశంలో అతిపెద్ద బ్యాంకుగా పేరుగాంచిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో డిగ్రీ అర్హతతో పీవో పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. దీని ద్వారా 2 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్సీ-300, ఎస్టీ-150, ఓబీసీ- 540, ఈడబ్ల్యూఎస్-200, జనరల్- 810 ఖాళీలు ఉన్నాయి. పీహెచ్సీ కోటాలో వీఐ-20, హెచ్ఐ-36, ఎల్డీ-20, డీ అండ్ ఈఈ-36 పోస్టులను కేటాయించారు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.
ప్రారంభ వేతనం రూ.41,960 (నాలుగు అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్తో). ప్రస్తుతం ఫైనల్ ఇయర్/ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాయనున్నవారు, మెడికల్, ఇంజినీరింగ్, సీఏ, కాస్ట్ అకౌంటెంట్ తదితర డిగ్రీలు చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.వయస్సు 2023, ఏప్రిల్ 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్లో సెప్టెంబర్ 27లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలు సెప్టెంబర్ 13న ‘నిపుణ’లో చూడవచ్చు.