హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన విల్లూ పూనావాలా ఫౌండేషన్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మధ్య శనివారం కీలక ఒప్పందం కుదిరింది. నిరుడు మేలో దావోస్లో నిర్వహించిన వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ అదర్ పూనావాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు.
అంటువ్యాధులను ఎదుర్కొనేందుకు నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. సానుకూలంగా స్పందించిన పూనావాలా పీహెచ్ఎఫ్ఐతో కలిసి హైదరాబాద్లోని ఐఐపీహెచ్లో సెంటర్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఐఐపీహెచ్లోడాక్టర్ సైరస్ పూనావాలా ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అండ్ పాండమిక్ ప్రిపేర్డ్నెస్ సెంటర్ ఏర్పాటు ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఒప్పంద పత్రాలపై వీపీఎఫ్ ప్రతినిధి సౌరభ్ ప్రభుదేశాయ్, సీఈవో జస్విందర్ నారంగ్, పీహెచ్ఎఫ్ఐ అధ్యక్షుడు ప్రొఫెసర్ జంయ్ జోడ పే సంతకాలు చేశారు.