SSC Exams | హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి పరీక్షలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రశ్నపత్రాలు బయటికి రాకుండా విద్యాశాఖ అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షాకేంద్రాల కిటికీలను గ్రీన్ క్లాత్తో మూసివేయాలని చెప్పారు. పరీక్షాకేంద్రాలకు ప్రహరీలు లేకపోయినా, ఎత్తు తక్కువగా ఉన్నా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇటీవలే హనుమకొండ జిల్లా కమలాపూర్లో హిందీ పరీక్ష జరుగుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు పరీక్షాకేంద్రంలోకి ప్రవేశించి ప్రశ్నపత్రాలను ఫొటోలు తీసి వాట్సాప్లో పంపించిన విషయం తెలిసిందే.
పదో తరగతి వార్షిక పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. శనివారం గణితం పరీక్ష జరుగగా, 99.63 శాతం విద్యార్థులు రాశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ జడ్పీహెచ్ఎస్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు ఇన్విజిలేటర్లను విధుల నుంచి తొలగించారు.