హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో రూ.1,913.93 కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు. ఈ బడ్జెట్ ఆమోదానికి ఢిల్లీలో ఈనెల 15, 16న జరిగిన ఎస్ఎస్ఏ ప్రాజెక్ట్ ఆమోదిత మండలి (పీఏబీ) సమావేశం పచ్చజెండా ఊపింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధికారులు ప్రతిపాదనలను రూపొందించి కేంద్రానికి పంపించా రు. ఇందులోభాగంగా కేంద్ర వాటాగా రూ.1,1 48 .34 కోట్లు, రాష్ట్రవాటాగా రూ. 765.56 కోట్లు ఖర్చుచేయాలని ప్రతిపాదించారు.