హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తులు సొంత వాహనాల్లో రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద రద్దీ పెరిగింది. వారాంతం కాకపోయినా భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. పాఠశాలలు, కళాశా లలు పనిచేస్తున్నా, సెలవు దినాలు కాకపోయినా భక్తులు భారీగా తరలిరావడం విశేషం. ఇదిలా ఉండగా సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.6.18 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ చరిత్రలో ఒకేరోజు హుండీ ఆదాయం రూ.6 కోట్లు దాటడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2018 జూలై 26న రూ.6.28 కోట్లు ఆదాయం వచ్చింది.