శ్రీశైలం : శ్రీశైలం దేవస్థానానికి రికార్డు స్థాయిలో హుండీ ఆదాయం వచ్చింది. 30 రోజుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆదాయం రావడం ఇదే మొదటిసారి అని దేవస్థానం ఈవో లవన్న మీడియాకు వెల్లడించారు. శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల హుండీలను లెక్కించగా.. రూ. 5,02,45,391 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. బంగారం 459 గ్రాములు, వెండి 14 కేజీలు వచ్చినట్లు పేర్కొన్నారు.