మహబూబ్ నగర్ : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 1,83,403 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 1,88,974 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జునసాగర్ దిశగా నీటిని వదులుతున్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఎగువన నుంచి వరద కొనసాగుతోంది. నారాయణపూర్, ఉజ్జయిని డ్యాంల నుంచి వరద ఉండడంతో… జూరాలకు 1,05,183 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదు అవుతోంది. 16 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా 65,094 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,471 క్యూసెక్కులు, సాగునీటి కాలువలకు కలిపి మొత్తం 1,05,646 క్యూసెక్కుల ఔట్ ఫ్లో ఉన్నది. ఎగువ నుంచి నిరంతరాయంగా వరద వస్తుండడంతో… ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం (9.657 టీఎంసీ) కంటే తక్కువలో (5.888 టీఎంసీ) నిల్వ ఉంచి వచ్చిన వరద వచ్చినట్లుగా శ్రీశైలం దిశగా వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 318.516 మీ. గాను ప్రస్తుతం 317.970 మీ. గా ఉంది. ఎగువ నుంచి ఇదే స్థాయిలో రాబోయే రెండు మూడు రోజుల్లో సైతం వరద ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.