హైదరాబాద్: ఎగువ నుంచి భారీగా వరద వచ్చిచేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ఏ క్షణమైన గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది. శ్రీశైలం జలాశయానికి ప్రస్తుతం 1,52,396 క్యూసెక్కుల వరద వస్తుండగా, 51,164 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుకాగా, ప్రస్తుతం 881.30 అడుగులవద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ట నీటినీల్వ 215.807 టీఎంసీలు. ఇప్పుడు 195.2102 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టానికి చేరడంతో కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.