Bhadradri | ఇల్లెందు రూరల్ : దర్గాలో శ్రీ సీతారాములు( Sitaramulu ) కొలువుదీరారు. భద్రాద్రి జిల్లా( Bhadradri Dist ) ఇల్లెందు మండలం సత్యనారాయణపురంలో ఉన్న హజరత్ నాగుల్మీరా చాన్ దర్గాకు శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ వెండి విగ్రహాలను భక్తులు (హిందువులు, ముస్లింలు) దానం చేశారు. వాటిని దర్గా నిర్వాహకులు శుక్రవారం తమ దర్గాలో ప్రతిష్ఠించి పూజలు చేశారు.
ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు మాట్లాడుతూ.. రెండేండ్లుగా సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలకు పూజలు నిర్వహిస్తున్నామని, ప్రస్తుతం భక్తులు వెండి విగ్రహాలను దానం చేయడంతో వాటిని ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నామని తెలిపారు. మత సామరస్యాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని తాము కోరుకుంటున్నామని, అందులో భాగంగానే దర్గాలో హిందూ, ముస్లింలం కలిసి ప్రార్థనలు, పూజలు చేసుకుంటామని పేర్కొన్నారు. ఈ దర్గాలో ఈ నెల 30న శ్రీరామనవమిని, 31న పట్టాభిషేకాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ రెండు రోజుల పాటు అన్నదాన కార్యక్రమం ఉంటుందన్నారు. దర్గా మాలిక్, లక్ష్మీనారాయణ, పులిగళ్ల మాధవరావు, పుట్టా శ్రీను, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.