నిజామాబాద్: భారీ వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ (Sriram Sagar) ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 59,078 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 16 గేట్లు ఎత్తి 49,960 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీరాం సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 1091 అడుగులు కాగా, ప్రస్తుతం 1091 అడుగులకు చేరి గరిష్టాన్ని తాకింది.
ఇక నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతున్నది. ప్రాజెక్టులోకి 21,100 క్యూసెక్కుల వరద వస్తుండగా, అధికారులు 2 గేట్లు ఎత్తి 17,745 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 700 అడుగులు. ఇప్పుడు 696.200 అడుగులకు చేరింది.