హైదరాబాద్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద ఉధృతి పెరిగింది. ఇప్పటికే ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో ఎనిమిదిగేట్లను ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 58వేల ఇన్ఫ్లో ఉండగా.. అదేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. శ్రీరాంసాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు. ప్రస్తుతం 1091 అడుగుల మేర నీరుండగా.. 90 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద వచ్చి చేరుతున్నది.