హైదరాబాద్, జనవరి25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా నారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
హైదరాబాద్లోని వైద్యా ఆరోగ్యశాఖ డైరెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న సంఘం కార్యాలయంలో రాష్ట్రస్థాయి కమిటీ ఎన్నిక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ సమక్షంలో గురువారం జరిగింది. కొత్తగా 19 మందితో రాష్ట్ర కార్యవర్గం ఎన్నికైంది.