ఆది శంకర భగవద్పాదులు ధర్మ స్థాపన కోసం మన దేశం నలుమూలల నాలుగు పీఠాలని స్థాపించారు. దక్షిణ భారత దేశానికి ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలోని శృంగేరి శారదాపీఠం స్థాపించబడినది. అనంత శ్రీ విభూషితులు జగద్గురు శంకరాచార్యులు శ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారు ప్రస్తుతం పీఠాధిపతిగా ఉన్నారు. వారి సంపూర్ణ ఆశీరనుగ్రహంతో వారి ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్యు శ్రీ విధూషేకర భారతీ స్వామివారు మన తెలంగాణ రాష్ట్రంలో ధర్మ విజయ యాత్రకు విచ్చేస్తున్నారు. అక్టోబర్ 16న సాయంత్రం వారు శంషాబాద్లో గల శృంగేరి మఠానికి చేరుకుంటారు. అటు తరువాత ఉత్తర తెలంగాణలోని బాసర, వేములాడ వంటి పుణ్య క్షేత్రాల దర్శనం, వివిధ దేవాలయాల్లో కుంభాభిషేకాలు నిర్వహిస్తారు. 21అక్టోబర్ నుంచి 3 నవంబర్ వరకు వారు హైదరాద్లో బస చేస్తారు. 21-28 తేదీల మధ్యలో నల్లకుంటలో గల శృంగేరి శంకరమఠంలో, నవంబర్ 1 నుంచి 3 వరకు సైనిక్పురి శృంగేరి శంకర మఠం నందు భక్తులని అనుగ్రహిస్తారు.