Sri Ramsagar Project | శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ, పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరిగింది.ప్రస్తుతం జలాశయానికి 45వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు ఏడుగేట్ల ఎత్తి 45వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఇప్పటికే జలాశయం నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రాజెక్టు నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులు, ప్రస్తుతం 1,088 అడుగుల మేర నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. జలాశయంలో 77 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.