చిత్తూరు, జూలై 31: సోషల్మీడియా లో పరిచయమైన శ్రీలంక యువతిని ఆంధ్రప్రదేశ్ యువకుడు పెండ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది. చిత్తూరు జిల్లాలోని అరిమాకుల పల్లికి చెందిన లక్ష్మణుడికి విఘ్నేశ్వరి శివకుమార ఫేస్బుక్లో పరిచయమైంది. క్రమంగా మనసులు కలిశాయి. పెండ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో పర్యాటక వీసాపై విఘ్నేశ్వరి ఏపీకి రాగా.. జూలై 14న గుడిలో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. అంతలోనే వారికి కొత్త సమస్య వచ్చింది. ఆగస్టు 6న విఘ్నేశ్వరి వీసా గడువు ముగుస్తుండడంతో వారు జిల్లా ఎస్పీని కలిసి తమ సమస్యను విన్నవించుకున్నారు. వీసా పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఒకవేళ గడువు పొడిగింపునకు అనుమతి రాకపోతే శ్రీలంకకు వెళ్లిపోవాలని విఘ్నేశరిని ఎస్పీ ఆదేశించారు.