యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపూర్వగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavalu) ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం స్వస్తి వాచనంతో పూజలు ప్రారంభమయ్యాయి. అనంతరం రక్షబంధనం, పుణ్యాహవాచనం చేశారు. సాయంత్రం 5 గంటలకు అంకురార్పణం, మృత్సంగ్రహణం చేయనున్నారు. తొలిపూజలో ఆలయ అనువంశిక చైర్మన్ బి.నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి పాల్గొన్నారు.
12న ఉదయం 10 గంటలకు ధ్వజారోహణం, వేదపారాయణాలు, సాయంత్రం 6గంటలకు భేరిపూజ, దేవతాహ్వనం, హవనం
13న ఉదయం హవనం, సింహవాహనం అలంకార సేవ, సాయంత్రం 6 గంటలకు హవనం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారి ఎదుర్కోలు (అశ్వవాహనం) ఉత్సవం
14న ఉదయం 8 గంటలకు హవనం, తిరుమంజనోత్సవం, హనుమంత వాహన సేవ, సాయంత్రం 6గంటలకు హవనం, రాత్రి 8గంటలకు శ్రీస్వామివారి తిరుకల్యాణోత్సవం (గజవాహనం)
15న ఉదయం 8గంటలకు హవనం, గరుడ వాహన సేవ, రాత్రి 8 గంటలకు స్వామివారి రథోత్సవం
16న ఉదయం 10గంటలకు పూర్ణాతి, చక్రతీర్థం, సాయంత్రం 6గంటలకు దేవతోద్వాసన, శ్రీపుష్పయాగం, డోలారోహణం
17న ఉదయం 9గంటలకు శ్రీస్వామివారి శతఘటాభిషేకం మధ్యాహ్నం ఒంటిగంటకు మహదాశీర్వచనం, పండిత సన్మానంతో ఉత్సవాలకు పరిసమాప్తి పలుకుతామని అన్నారు.