హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఎప్సెట్-2026 ఫలితాల్లో శ్రీచైతన్య విదా ్యసంస్థలకు చెందిన విద్యార్థులు మరోసారి సత్తాచాటారు. ఆదివారం విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మా విభాగాల్లో శ్రీచైతన్య విద్యార్థులు టాప్ -10 ర్యాంకులు సాధించారు. ఇంజినీరింగ్లో స్టేట్ 3వ ర్యాంక్ను తమ విద్యార్థులు వంశీధర్రెడ్డి, 4వ ర్యాంక్ను జే రోషణ్ మణిదీప్రెడ్డి, 9వ ర్యాంక్ను బీ సమీరాజ్ సాధించారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ తెలిపారు. అగ్రి ఫార్మా విభాగంలో జి.సాహితీ గీతిక 3వ ర్యాంక్ను, ఆమేర్ అనీస్ 5వ ర్యాంక్ను, నాథన్ షీబా జెరుషా 6వ ర్యాంక్ను, పి.అనురాగ్ 7వ ర్యాంక్ను, బి.సాయి శరణ్ 8వ ర్యాంక్ను, మారుతీ సత్యశ్రీకర్ 9వ ర్యాంక్ను, ఆర్.మహంతి 10వ ర్యాంక్ను సాధించినట్లు వివరించారు. వీటితో పాటు ఎప్సెట్లో టాప్ 100 ర్యాంకుల్లో తమ విద్యార్థులు 93 ర్యాంకులు సాధించి అద్ధుత ప్రతిభ కనబర్చారని పేర్కొన్నారు. నీట్, జేఈఈ ఫలితాల్లో సైతం శ్రీచైతన్య విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.