హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 25: జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎస్సార్ విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించి, ప్రభంజనం సృష్టించారని ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ ఏ వరదారెడ్డి తెలిపారు. ఓపెన్ క్యాటగిరీలో దొంతుల మనీశ్ 126 ర్యాంకు, ఆలిండియా రిజర్వేషన్ క్యాటగిరీలో జీ నవీన్ 5వ ర్యాంకు, ఏ నందిని 12వ ర్యాంకు, వై సాత్విక్రెడ్డి 42వ ర్యాంకు, జీ కాలు 55వ ర్యాంకు సాధించి ఎస్సార్ కీర్తి ప్రతిష్ఠను జాతీయస్థాయిలో నిలబెట్టారని పేర్కొన్నారు.
అదేవిధంగా, దాసరి కార్తిక్ 131, జే శ్రీథన్రెడ్డి 144, కే ప్రశాంత్రెడ్డి 148, తుమ్మ తేజస్వీ 149, కాసారాం అఖిల్యాదవ్ 154, పీ నిహాల్ శ్రీవాత్సవ్ 186, కే శ్రీరాంరెడ్డి 192, తుమాటి అమృతవర్షిణి 201, కే రమణారెడ్డి 211, టీ శ్రేష్ఠ 225, పీ రిత్విక్ 314ర్యాంకుతో పాటు ఓపెన్ అన్ని క్యాటగిరీలలోకలిపి ఆలిండియాలో వరుసగా 357, 385, 430, 431, 433, 497, 530, 614, 550, 599, 625, 662, 730, 782, 783, 788, 800, 861, 870, 872, 944 ర్యాంకులు కైవసం చేసుకొన్నట్టు వివరించారు. ఇప్పటివరకు 3,256 మందికిపైగా విద్యార్థులు అడ్వాన్స్కు అర్హత సాధించినట్టు తెలిపారు.