Special Train | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోని కాచిగూడ, కాజీపేట రైల్వేస్టేషన్ల మీదుగా ఉత్తరాఖండ్లోని రిషికేశ్కు ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు తెలిపింది. యశ్వంత్పూర్-యోగ్ నగరి రిషికేశ్ (06597)కు ప్రతి గురువారం రైలు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ రైలు గురువారం ఉదయం 7గంటలకు రిషికేశ్లో బయలుదేరి ఆదివారం గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు కాచిగూడలో రాత్రి 8.50 గంటలకు.. కాజీపేటలో 11.33 గంటలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.
రిషికేశ్-యశ్వంత్పూర్ (06598) రైలు ప్రతి ఆదివారం నడుస్తుంది. ఆదివారం సాయంత్రం 5.55 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు రెండుమార్గాల్లో యెలహంక జంక్షన్, హిందుపూర్, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లర్షా, నాగ్పూర్, భోపాల్, బినా జంక్షన్, ఝాన్సీ, గ్వాలియర్, ఆగ్రా కాంట్, మధుర, నిజాముద్దీన్, ఘజియాబాద్, మీరట్, ముజఫర్నగర్, తాప్రి, రూర్కీ, హరిద్వార్ స్టేషన్లలో ఆగుతుందని పేర్కొంది. ఈ రైలులో ఫస్ట్క్లాస్ ఏసీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ, స్లీపర్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉన్నాయని వివరించింది.