హైదరాబాద్ : సికింద్రాబాద్ – సుబేదార్గంజ్, నాందేడ్ – తిరుపతి మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 24 నుంచి అందుబాటులో ఉంటాయని తెలిపారు. అలాగే సికింద్రాబాద్ – తిరుపతి రైల్వే స్టేషన్ల మధ్య అదనంగా మరో రెండు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ స్టేషన్ల మధ్య ప్రయాణించే ప్రయాణికులు అదనపు రైళ్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.