హైదరాబాద్ : ఈ నెల 10న ఆషాఢ ఏకాదశి సందర్భంగా మహరాష్ట్ర నుంచి పందాపూర్ వరకు ఆరు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు మంగళవారం వెల్లడించారు. ఈ నెల 9 నుంచి ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆరు రైళ్లను జల్నా-పందాపూర్, ఔరంగాబాద్ – పందాపూర్, నాందేడ్ – పందాపూర్ స్టేషన్ల మధ్య రాకపోకలు కొనసాగిస్తాయని తెలిపారు.
ధనాపూర్-బెంగుళూరు రైల్వే స్టేషన్ల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను ఈ నెల 7 నుంచి, 10 తేదీల్లో నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ప్రకటించారు.