హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): వరుస సెలవుల నేపథ్యలో ప్రయాణికులను రద్దీని అధిగమించేందుకు సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, తిరుపతిలకు పలు రైళ్లను ప్రకటించారు. ఈ నెల 13, 14, 15 తేదీల్లో నర్సాపూర్-సికింద్రాబాద్-నర్సాపూర్ మధ్య మూడు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది.