హైదరాబాద్ : పూరిలో ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ రథయాత్రకు ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే జోనల్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రత్యేక రైళ్లు ఈ నెల 18, 19, 20, 21, 22 తేదీలలో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని ప్రకటించారు. ఇందులో సికింద్రాబాద్-మాలతిపట్పూర్, నాందేడ్- కుర్దారోడ్, కాచిగూడ ,మాలతిపట్పూర్ వంటి స్టేషన్ల మధ్యలో ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగిస్తాయన్నారు.
పలు రైల్వే స్టేషన్ల పరిధిలో పది రైళ్లు రద్దు..
బహనాగ బజరా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లాల్సిన పది రైళ్లను ఈ నెల 18, 19 తేదీలలో రద్దు చేసినట్లు పేర్కొన్నారు. వీటిలో షాలీమార్-హైదరాబాద్, సత్రగాచి-తిరుపతి, గౌహతి-సికింద్రాబాద్, హౌరా-పుదుచ్చేరి, చెన్నై సెంట్రల్- సత్రగాచి, మైసూర్-హౌరా, సికింద్రాబాద్-ఆగ్రాతో పాటు ఎర్నాకులం-హౌర్ స్టేషన్ల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొనారు.