హైదరాబాద్ : శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే (సౌత్ సెంట్రల్ రైల్వే) తీపి కబురును అందించింది. ఎస్సీఆర్ పరిధిలో ఉన్న సికింద్రాబాద్ తో పాటు ఏపీలోని పలు స్టేషన్ల నుంచి శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు వెల్లడించింది. డిసెంబర్ ఒకటి నుంచి వచ్చే జనవరి 20 వరకు ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు కొనసాగుతాయని బుధవారం రైల్వే అధికారులు తెలిపారు. శబరికి వెళ్లే భక్తుల కోసం ఈ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
నాన్ ఇంటర్ లాకింగ్ వల్ల 28 రైళ్లు రద్దు..
బుద్రి-బర్కేరా స్టేషన్ల మధ్య కొనసాగుతున్న నాన్ ఇంటర్ లాకింగ్ పనుల వల్ల ఆయా మార్గంలో నడువాల్సిన 28 రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి డిసెంబర్ 9 వరకు టైంటేబుల్ వారీగా రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు.