హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఎంబీసీల సంక్షేమానికి తెలంగాణ సర్కారు ఆది నుంచి పెద్దపీట వేస్తున్నదని, తాజాగా సబ్సిడీ రుణాల కోసం ఒక్క ఎంబీసీలకే రూ.300 కోట్లు మంజూరు చేయడం గొప్ప విషయమని ఎంబీసీ సంఘం జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సీఎం కేసీఆర్, మంత్రి గంగులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం నాయీబ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్తోపాటు, ఆధునిక ధోబీఘాట్లు నిర్మించిందని చెప్పారు. గతంలో లేనంత ఎంబీసీలకు సబ్సిడీ రుణాల కోసం నిధులు మంజూరు చేసిందని కొనియాడారు. బీసీలకు కూడా 303 కోట్లు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.