మునుగోడు : మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి కి మద్దతుగా ఆదివారం నియోజకవర్గంలోని నారాయణపురంలో ప్రచారం నిర్వహించారు. పాదయాత్ర చేస్తూ ప్రతి ఇంటికి వెళ్లి కారు గుర్తుకే ఓటు వేసి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని కోరారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకే ప్రజలు మద్దతు తెలుపుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, ఎర్రం శ్రీనివాస్ గుప్తా, శ్రీనివాస్, మస్కనూరి భాస్కర్, శంకర్ముదిరాజ్, వల్లాల శ్రీనివాస్ యాదవ్, దీన్దయాల్ రెడ్డి, రాంచందర్, రాజేశ్, శ్రీకాంత్ యాదవ్, నితిన్, చాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.