గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి విద్యార్థులు పోటీపడుతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలకు విశేష ఆదరణ లభిస్తున్నదనడానికి ఈ చిత్రం నిదర్శనంగా నిలుస్తున్నది. ఆదివారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని గురుకులంలో ఐదోతరగతిలో ప్రవేశానికి పరీక్ష నిర్వహించారు. సాంఘిక సంక్షేమ, ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాలకు 955 మంది దరఖాస్తు చేయగా 792 మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రం ఆవరణ కిక్కిరిసిపోయింది. – తుంగతుర్తి