హైదరాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): మేడారం జాతరలో సమ్మక్క-సారక్కలను దర్శించుకొనేందుకు దివ్యాంగులకు ప్రత్యేక వసతులు కల్పించాలని అఖిలభారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు నాగేశ్వర్రావు కోరారు. ఈ మేరకు శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ను కలిసి వినతిపత్రం అందజేశారు. అమ్మవార్ల గద్దెల వద్దకు తీసుకెళ్లేవిధంగా ప్రత్యేక వలంటీర్లను, వీల్చైర్లను అందుబాటులో ఉంచాలని కోరారు. దీనిపై స్పందించిన వినోద్కుమార్ వెంటనే ములుగు కలెక్టర్ చైతన్యతో ఫోన్లో మాట్లాడారు. జాతరలో దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వినోద్ను కలిసినవారిలో దివ్యాంగుల హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహంకాళీ రవీందర్, శ్రీనివాస్, గోవింద్, రాజయ్య తదితరులు ఉన్నారు.