హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యాశాఖ అప్రమత్తమైంది. ఈ నెల నుంచే విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నది. ఈ మేరకు పలు జిల్లాల డీఈవోలు ఆయా పాఠశాలలకు ఆదేశాలిచ్చారు. ఉదయం 8 : 30 గంటల నుంచి 9 : 30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని జనగామ జిల్లా డీఈవో ఆదేశించారు. ప్రధానోపాధ్యాయులు వీలును బట్టి స్పెషల్ క్లాసుల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
21 వరకు ఓపెన్ స్కూల్ ప్రవేశాలు
2022 -23 విద్యాసంవత్సరానికి గాను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ప్రవేశాల గడువును ఈ నెల 21 వరకు పొడిగించినట్టు సొసైటీ డైరెక్టర్ పీవీ శ్రీహరి తెలిపారు.