హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ఇరిగేషన్ శాఖలోని 17 మంది ఇంజినీర్లను బదిలీ చేస్తూ గురువారం సాగునీటి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
51 మంది డీఎస్పీల బదిలీ
రాష్ట్ర ప్రభుత్వం 51 మంది డీఎస్పీలను బదిలీ చేసింది. ఈ మేరకు డీజీపీ అంజనీకుమార్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మహంకాళి ఏసీపీగా రవీందర్, గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి, వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డికి పోస్టింగ్ ఇచ్చింది. సంబంధిత ఉన్నతాధికారులు సదరు డీఎస్పీలను రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.