కామారెడ్డి : స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని మహేశ్వరీ థియేటర్లో గాంధీ సినిమాను విద్యార్థులతో కలిసి వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పిల్లలతో కలిసి సినిమా చూడటం సంతోషంగా ఉందన్నారు.
దేశం కోసం గాంధీజీ పోరాడిన విధానాన్ని నేటి బాలలకు తెలియజేసేందుకే సీఎం కేసీఆర్ ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారన్నారు. అంతకు ముందు స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్లో పాల్గొన్నారు. స్పీకర్తో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.