నిజామాబాద్ : గత మూడు వారాల క్రితం కరోనా వైరస్ సోకి హోం క్వారంటైన్ లో ఉన్న శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా కోలుకున్నారు. కాగా, సోమవారం భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
దేశాభివృద్ధిలో అంబేద్కర్ ఎంతో పాత్ర ఎంతో కీలకమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ పరిపాలన కొనసాగుతుందన్నారు.