హైదరాబాద్ : నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నరసింహ మృతి పట్ల అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. చిరుమర్తి నరసింహా ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించారు. కాగా, ఎమ్మెల్యే లింగయ్య తండ్రి నర్సింహా(75) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. నార్కట్పల్లి కామినేని దవాఖానలో చికిత్స అందిస్తున్నారు. రెండు రోజుల కిందట ఆరోగ్యం మరింత విషమించడంతో సోమవారం మధ్యాహ్నం నర్సింహా తుది శ్వాస విడిచారు.